ప్రేమ వేధింపు: కోరిక తీర్చలేదని యువతిని కాల్చేశాడు
సోమవారం రాత్రి తన కోరిక తీర్చమని బలవంతం చేయడంతో ఆమె పోలీసులకు ఫోను చేసి ఫిర్యాదు చేసింది. మర్నాడు పోలీసు స్టేషన్కు రమ్మని పోలీసులు ఆమెకు చెప్పారు. మంగళవారం ప్రమోద్ మరోసారి ఆ యువతి వద్దకు వచ్చి పోట్లాడే ప్రయత్నాలు చేశాడు. తన కోరిక తీర్చమని వేధించాడు.
ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కిరోసిన్ చల్లి నిప్పంటించి పారిపోయాడు. మంటల్లో కాలిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురంలోని గురువారం ఉదయం దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ వ్యక్తిని రాయితో మోది చంపేశారు. దీంతో ఆ వ్యక్తి మొహం గుర్తు పట్టలేనంతగా చిద్రమైంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆ వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.