ఎన్టీఆర్ విగ్రహం: ఫ్యామిలీలో కొత్త మలుపులు (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంటులో సభాపతి మీరా కుమార్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కారణంగా అన్నగారి కుటుంబంలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. ఈ వివాదం కారణంగా అన్నగారి కుటుంబంలో కొత్త కొత్త కోణాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒంటికాలిపై లేచే ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఈ విషయంలో మాత్రం ఆయనకు మద్దతు పలుకుతున్నారు! తనతో పాటు బాబుకు ఆహ్వానం అందాల్సిందేనని, తాను ఎన్టీఆర్ భార్యనని, అతను అల్లుడని.. అలాంటప్పుడు తామిద్దరికి కూడా ఆహ్వానం అందాలని బాబుకు మద్దతుగా నిలిచారు.
ఇక పురంధేశ్వరిపై ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే ధైర్యం లేదని, ఆయన వెనుక కేంద్రమంత్రి పురంధేశ్వరి హస్తం ఉందని ఆరోపించారు. ఆఖరు సమయంలో ఎన్టీఆర్ క్షోభకు పురంధేశ్వరే కారణమని ఆమె మండిపడ్డారు. ఇంకోవైపు పురంధేశ్వరి గేమ్ ప్లాన్లో చంద్రబాబు ఇరుకున పడ్డారు.
ఎన్టీఆర్ విగ్రహానికి వెళ్లకుంటే విమర్శలు, వెళదామా అంటే స్పీకర్ నుండి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయన ఏమీ తేల్చుకోలేక పోతున్నారు. ఆయన బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణ వెళ్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు.
వెళ్లడంపై తేల్చుకోలేక చంద్రబాబు, ఆహ్వానం రాక లక్ష్మీ పార్వతి ఆగ్రహంతో ఉన్నారు. ఇంకోవైపు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లవద్దని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పలువురు కాంగ్రెసు నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అన్నగారి కుటుంబంలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కేలా చేశాయి.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో పురంధేశ్వరి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
తనకు ఆహ్వానం అందకపోవడంపై లక్ష్మీ పార్వతి కేంద్రమంత్రి పురంధేశ్వరిపై మండిపడ్డారు. బాబుకు వెన్నుపోటు ధైర్యం లేదని, వెనుక పురంధేశ్వరి ఉన్నారని ఆరోపించారు. తనకు ఆహ్వానం అందకపోవడంపై కోర్టుకెక్కుతానని చెప్పారు.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
తమకు స్పీకర్ నుండి ఆహ్వానం అందాలని, పురంధేశ్వరి ఏ హోదాలో తమను ఆహ్వానిస్తారని టిడిపి మండిపడుతోంది. స్పీకర్ నుండి ఆహ్వానం రాక, పురంధేశ్వరి నుండి మాత్రమే రావడంతో చంద్రబాబు డైలమాలో ఉన్నారు.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
విగ్రహవిష్కరణ కార్యక్రమం కోసం జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఢిల్లీలో వాలిపోయారు. బాలకృష్ణ హాజరు కానున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం: కొత్త మలుపులు(పిక్చర్స్)
కాంగ్రెసును వ్యతిరేకించి టిడిపిని స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లవద్దని కాంగ్రెసు ఎంపీలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేయడం కొసమెరుపు.