సంజయ్ దత్ కేసులో ఒత్తిళ్లు: విజయరామారావు
న్యాయశాఖ మంత్రికి నివేదికలు చూపించిన ఘటనలు తన హయాంలో ఏనాడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ డైరెక్టర్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ఆచరణలో సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి సిబిఐపై ఒత్తిళ్లు ఉండడం సహజమేనని ఆయన అన్నారు.
సిబిఐని విభజించి అవినీతి నిరోధక విభాగాన్ని స్వతంత్రంగా ఉంచాలని కేందర్ హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మంత్రులపై చార్జిషీట్ దాఖలు చేసినా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.
ముంబై బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు నివేదికను న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్కు చూపించినట్లు సిబిఐ అంగీకరించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈ సదస్సు ఏర్పాటైంది.