జీవన్ రెడ్డికి జాలి చూపులు: టిఆర్ఎస్కు 'ఫస్ట్' ఫీవర్!

అందుకు ఓ కారణముందంటున్నారు. తెరాస ఎన్నికల్లో సత్తా చాటడం, చాటకపోవడం విషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీ మొదటి అభ్యర్థిగా ప్రకటించబడిన వారు గెలిచిన సందర్భాలు లేవంటున్నారు. అంతేకాదు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందట. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ఆర్మూర్ నియోజకవర్గానికి ఎ.జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు.
గత అనుభవాల నేపథ్యంలో పార్టీ నేతలు ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటిదాకా పార్టీ తొలి అభ్యర్థి ఎవరూ గెలవలేదట. 2004 ఎన్నికల్లో తెరాస తొలి అభ్యర్థిగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన రేగులపాటి పాపారావు (సిరిసిల్ల) పేరును కెసిఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పాపారావు ఓడిపోయారు. ఇప్పుడాయన పేరు ఎక్కడా వినిపించడంలేదు. 2009 ఎన్నికల్లో తొలి అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించిన సత్యనారాయణ రెడ్డి కూడా పెద్దపల్లిలో ఓడిపోయారు.
అంతేకాదు.. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూ, మొన్నటిదాకా ఇన్చార్జిగా కూడా పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని పెద్దపల్లి ఇన్చార్జి పదవి నుంచి కూడా తొలగించారు. ఆయన స్థానంలో మనోహర్ రెడ్డిని ఈ మధ్యనే కెసిఆర్ నియమించారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఆర్మూర్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. దీంతో జీవన్ రెడ్డిపై సహచరులు జాలి చూపుతున్నారట.












Click it and Unblock the Notifications