అంబరీష్కు బెర్త్: నటి ఉమాశ్రీకి చోటు, 10 కొత్తముఖాలు

ఆర్వి దేశ్పాండే, అంబరీష్, కృష్ణ బైర్ గౌడ వంటి సీనియర్లకు సిద్ధరామయ్య తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి మాత్రమే చేరారు. నటి ఉమాశ్రీకి మంత్రివర్గంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో చోటు కల్పించారు. డికె శివకుమార్కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రమణ స్వీకారం చేసినవారిలో 20 మంది క్యాబినెట్ మంత్రులు కాగా మిగతా పది సహాయ మంత్రులు.
సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేరినవారు వీరే..
రామలింగారెడ్డి, ఆర్వి దేశ్పాండే, ప్రకాష్ హుక్కేరి చిక్కోడి, సామనూరు శివశంకరప్ప, ఏకె పాటిల్, జయచంద్ర, ఖమరూల్ ఇస్లాం, రామనాథ్ రాయ్, మహదేవప్ప, అంబరీష్, బాబూరావు, కెజె జార్జ్, హెచ్ ఆంజనేయ, యాటీ కదీర్, ఎంబి పాటిల్, తంగడదడి, దినేష్ గుండూరావు, ఆభిరాయ్ గౌడ, అభయ్ చంద్ర జైన్, రత్నాకర్, ఉమాశ్రీ, సంతోష్ , సతీష్ జరకిహోళి, పరమేశ్వర్ నాయక్, వినయ్ కుమార్, వి. శ్రీనివాస ప్రసాద్, శరన్ ప్రకాష్ పాటిల్య
సిద్ధరామయ్య ఈ నెల 13వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పుపై చర్చించడానికి సిద్ధరామయ్య ఈ వారాంభంలో ఢిల్లీ వెళ్లారు. స్థిరమైన, సమర్థమైన ప్రభుత్వాన్ని అందిస్తానని సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చెప్పారు.












Click it and Unblock the Notifications