వేటు!: అధిష్టానంపై ధర్మాన అలక, అనుచరుల ఆగ్రహం
ఆయనతో భేటీ అయిన తర్వాత ఆయన తన భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రోజు ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. ధర్మానపై వేటు పడుతుందనే ప్రచారం నేపథ్యంలో ధర్మాన అనుచరులు శ్రీకాకుళం జిల్లాలో రహస్యంగా భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెసు పార్టీకి మద్దతుగా నిలిచిన ధర్మానకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్మాన కూడా తన వర్గంతో శనివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక నిర్ణయించుకుందామని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీ మోహన్, కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు ధర్మానకు అండగా నిలబడినట్లుగా తెలుస్తోంది.
కాగా, అధిష్టానం వేటు నిజమే అయితే... కళంకిత మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం వస్తే ఆయన రాజీనామా చేసి... 21వ తేదిన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి భేటీ అయ్యారు.