బుకీలపై చేతులెత్తేసిన బిసిసిఐ: చర్యలపై నిర్ణయం లేదు
స్పాట్ ఫిక్సింగ్ విషయమై ఐసిసి అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతోందన్నారు. స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన ఆధారాలు తమకివ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు చెప్పారు. దీనిపై అంతర్గతంగా విచారిస్తామని, విచారణాధికారిగా సవాని నియమించినట్లు చెప్పారు.
క్రికెటర్లకు, ఏజెంట్లకు తమ గుర్తింపు తప్పని సరి అన్నారు. బుకీలపై తమకు ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. అరెస్టైన ముగ్గురు ఆటగాళ్లపై కేసు పెట్టాలని రాజస్థాన్ రాయల్స్కు ఆదేశించినట్లు చెప్పారు. కాగా, ముగ్గురు క్రికెటర్ల పైన జీవిత కాలం నిషేధంపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు ఫిక్సింగ్ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా బుకీల పైన దాడులు చేస్తున్నారు. క్రికెటర్లు బస చేసిన హోటళ్లకు సిసి టివి ఫుటేజ్లను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ముగ్గురు క్రికెటర్లపై రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.