భార్యాబిడ్డల హత్య: 20 ఏళ్ల తర్వాత వ్యక్తి అరెస్టు

కనకరాజు నుంచి పోలీసులు 37 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన తర్వాత కనకరాజు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఆలయాల్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని నిందితుడు పోలీసులకు తెలిపారు. అతడ్ని నాగపూర్ పోలీసులకు అప్పగించనున్నారు.
ఇదిలావుంటే, కడప జిల్లాలోని మైదుకూరు - ప్రొద్దుటూరు రోడ్డులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా తన భార్య గొంతు కోశాడు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటంబ కలహాల కారణంగా అతను ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో బాబు అనే వ్యక్తిని హత్య చేశారు. ఇంటి సరిహద్దు విషయంలో బాబుకు, పక్కింటివారికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బాబు హత్యకు గురయ్యాడు.
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాలో ఓ యువకుడు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సోమవారంనాడు ఈ ఘటన జరిగింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications