రాజీవ్ ఇంకొంత కాలం ఉంటే ముందుండేవాళ్లం: కిరణ్
రాజీవ్ చిత్ర పటానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. రాజీవ్ మరింత కాలం ప్రధానిగా ఉంటే దేశం మరింత ముందుకు పోయేదన్నారు. చరిత్రను తిరగరాసే నిర్ణయాలను ఆయన తీసుకున్నారన్నారు.
సామాన్యులకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది రాజీవ్ గాంధే అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాలు అవసరమని ప్రజలకు వివరించాలని బొత్స సూచించారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థలకు అధికారాలు నిర్ణయాలు తీసుకున్నది రాజీవే అన్నారు.
రాజీవ్ 22వ వర్ధంతి మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్మృతి చిహ్నం వీర్ భూమి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు రాజీవ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.