Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుస్సేన్‌సాగర్‌లో దూకి టెక్కీ భార్య ఆత్మహత్యయత్నం

Hussain Sagar
హైదరాబాద్/కడప: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకి అత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, తల్లిని పోలీసులు రక్షించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గుప్త నిధుల కోసం నరబలి

కడప జిల్లాలో దారుణం జరిగింది. అట్లూరు మండలం వలసపాలెంలో గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారు. నర్సింహ అనే ఇరవై అయిదేళ్ల యువకుడు సోమవారం రాత్రి నుంచి కనిపించలేదు. తల్లిదండ్రులు గాలించగా.. ఉదయం పోతులూరి దేవాలయం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం లభించింది.

పోలీసులకు సమాచారం అందటంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసమే యువకుడిని బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రమాదంలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలులో త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, స్కార్పీయో ఢీకొనడంతో ఇది జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

భార్యను చంపిన భర్త

గుంటూరు నగర శివారు గోరంట్ల ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ భర్త చేతిలో హత్యకు గురయింది. భార్యపై అనుమానంతో భర్త థామస్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+