ఓక్లహామాలో బలమైన టోర్నడోలు: 91 మంది మృతి

ప్రజలు భయభ్రాంతులకులోనై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. టెక్సాస్నుంచి మిన్నెసొటా వైపు పయనిస్తున్న తుఫాను ప్రభావం ఒక్లహామా, కన్సాస్పై తీవ్రంగా ఉంది. టోర్నడోలు విరుచుకుపడడంతో షావన్నీ పట్టణంలోని వీధులు, ఇళ్లు దుమ్ము, ధూళి, బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు తిరగబడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది.
కన్సాస్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టోర్నడోల ప్రభావం పూర్తిగా తొలిగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒక్లహామా నగరంలో తొలుత 51 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో 40 శవాలను వెలికి తీశారు.
తమను భారీ టోర్నడో తాకిందని ఒక్లహామా గవర్నర్ మేరీ ఫాలిన్ చెప్పారు. చాలా నిర్మాణాలు కూలిపోయాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ప్రజలను కోరినట్లు పోలీసు చీఫ్ మూరే చెప్పారు. మరిన్ని టోర్నడోలు తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications