వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధైర్యం చెప్తున్న షర్మిల: వెయిట్ చేయాలని విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
ఏలూరు/కడప: వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల సమస్యలు తీరిపోతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల బుధవారం అన్నారు. షర్మిల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలను జగన్ తీర్చుతారని షర్మిల ప్రజలకు తన యాత్రలో ధైర్యం చెప్పారు.

ప్రజలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వారికి ధైర్యం చెబుతూ పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర బుధవారానికి 156వ రోజుకు చేరుకుంది. షర్మిల పాదయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

కడిగిన ముత్యంలా వస్తాడు: విజయమ్మ

జగన్ కడిగిన ముత్యంలా జైలునుంచి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కడప జిల్లాలో అన్నారు. జగన్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టనున్నట్లు చెప్పారు. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని డైరెక్టర్ రంజిత్ సిన్హాయే స్వయంగా పేర్కొన్నారన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వచ్చినందుకే జగన్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండిఉంటే ఈపాటికే మంత్రికానీ, ముఖ్యమంత్రిగానీ అయ్యేవాడని తెలిపారన్నారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు జారీ చేసిన 26 జీవోలపై మాత్రమే ఆరోపణలు వచ్చాయన్నారు. ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం కౌంటరు ఫైలు కూడా దాఖలు చేయలేదన్నారు. జగన్ జైలు నుండి విడుదలై త్వరలో బయటకు వస్తారని, అప్పటి వరకు వెయిట్ చేయాలని విజయమ్మ పులివెందుల ప్రజలకు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చేముందు వైయస్ ఇచ్చిన వాగ్దానాలు గాలికొదిలి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెబితే నమ్మేందుకు ప్రజలేమైనా పిచ్చోళ్లా..? అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర్ వేరుగా అన్నారు. జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అంటున్న మంత్రులు ఆ 26జీఓలు సక్రమమే అని సుప్రీం కోర్టుకు ఎలా చెప్పారని ప్రశ్నించారు. వైయస్ వల్ల మంత్రులైన నేతలు కాంగ్రెస్ రాష్ట్ర సమావేశంలో ఆయన ఫొటో కూడా పెట్టలేదన్నారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma told Pulivendula people to wait some more time to see YS Jaganmohan Reddy out of jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X