వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ బలంగా ఉన్నారంటూనే..: బాబుపై శోభా నాగిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: తమ పార్టీ అద్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏడాదిగా జైల్లో ఉంచడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి ఆదివారం అన్నారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను జైలులో ఉంచి ఏడాది పూర్తి అవుతుందని, సిబిఐ తీరును నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చటెప్పారు.

అవిశ్వాస తీర్మానం సమయంలో తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని ఆరోపించారు. అదే ప్రభుత్వంపై ఇప్పుడు బాబు అవిశ్వాసం పెడతానంటున్నారని, అలా అంటూనే మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు బలంగా ఉంటుందని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారన్నారు.

English summary

 YSR Congress Party leader Sobha Nagi Reddy has condemned Telugudesam Party chief Nara Chandrababu Naidu's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X