వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాపార్టీలో దొంగలు: జూపూడి, టిడిపికి మద్దతిస్తామని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
గుంటూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో దొంగలు పడ్డారని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట. తాను గెలిస్తే చాలని, పార్టీ ఏమైనా ఫర్వాలేదనే భావనలో కొందరు నాయకులు ఉన్నారని, ముందు వారిని బయటకు సాగనంపాలని వ్యాఖ్యానించారు.

పార్టీలో కొత్తగా ఫ్లెక్సీల బ్యాచ్ తయారైందని, తామే పార్టీలో అంతా చేస్తున్నట్లు ఊదరగొట్టుకుంటున్నారని, మరికొందరికి నియోజకవర్గాల సరిహద్దులు కూడా సరిగా తెలియవని, ప్రజాస్వామిక విలువలపై కూడా అవగాహన లేని వారున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదవులు పొంది, ఆస్తులు సంపాదించిన వారంతా ఇప్పుడు తమ పార్టీ అద్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నారని మండిపడ్డారు.

అలాంటి వారికి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. సిబిఐ కేసుల్లో ఉన్నవారు సైతం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ను అరెస్టు చేసి ఏడాదైన సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి హైదరాబాదులో చెప్పారు. ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెట్టినా, తాము మద్దతు ఇస్తామని తెలిపారు.

English summary

 YSR Congress Party MLA Gurunath Reddy has said that party will back No Trust vote moved by Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X