నన్ను పిలవలేదు అందుకే: జూ.ఎన్టీఆర్, టిడిపిపై హరి
తనకు మహానాడుకు రావాలని పిలుపు అందలేదని, ఆహ్వానం వస్తే మాత్రం తాను తప్పకుండా వెళతానని ఆయన చెప్పారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిదే ఘన విజయమని, అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో పాటు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు నివాళులు అర్పించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తన అదృష్టమన్నారు. ఆయన ఆశయాల కోసం పని చేస్తామన్నారు.
నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. అన్నగారి ఆశయాలను తాము ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపియే అధికారంలోకి రావాలన్నారు. పార్టీ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా నివాళులు అర్పించారు.