అందరివాడు: మంత్రి డొక్కా ఆఫీస్లో ఎన్టీఆర్ జయంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలలు జరిగాయి. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకలో మంత్రి డొక్కా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల మనిషి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బున్న వాళ్ల మనిషన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.
కాగా, హైదరాబాదులో టిడిపి నిర్వహిస్తున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి అధినేత చంద్రబాబు నాయుడు, హరికృష్ణ, బాలకృష్ణలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు భారీ కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications