మర్యాదపూర్వకంగానే కలిశా: హరికృష్ణతో భేటీపై గద్దె

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ, విజయవాడ పార్లమెంటు సీటుపై పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న గద్దె రామ్మోహన్ మధ్య మంతనాలు జరగడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భేటీపై కలకలం రేగడంతో గద్దె రామ్మోహన్ రావు వివరణ ఇచ్చారు.
హరికృష్ణను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తమ పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, లంకా దాసరి, చలమలశెట్టి రామానుజయ్య కూడా ఉన్నారని తెలిపారు. హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎమ్మెల్యేనని, ఆ పరిచయంతోనే హరికృష్ణను కలిసి మాట్లాడానని చెప్పారు.
ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన పార్టీ మహానాడుకు హరికృష్ణ తొలి రోజు వచ్చారు. అయితే, చురుగ్గా వ్యవహరించలేదు. పార్టీ కండువా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. రెండో రోజు పూర్తిగానే దూరంగా ఉన్నారు. పార్టీకి దూరమవుతూ వస్తున్న హరికృష్ణతో హోటల్ గదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ పార్లమెంటు సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు బుధవారంనాడు సుదీర్ఘ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications