మర్యాదపూర్వకంగానే కలిశా: హరికృష్ణతో భేటీపై గద్దె

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ, విజయవాడ పార్లమెంటు సీటుపై పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న గద్దె రామ్మోహన్ మధ్య మంతనాలు జరగడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భేటీపై కలకలం రేగడంతో గద్దె రామ్మోహన్ రావు వివరణ ఇచ్చారు.
హరికృష్ణను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తమ పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, లంకా దాసరి, చలమలశెట్టి రామానుజయ్య కూడా ఉన్నారని తెలిపారు. హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎమ్మెల్యేనని, ఆ పరిచయంతోనే హరికృష్ణను కలిసి మాట్లాడానని చెప్పారు.
ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన పార్టీ మహానాడుకు హరికృష్ణ తొలి రోజు వచ్చారు. అయితే, చురుగ్గా వ్యవహరించలేదు. పార్టీ కండువా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. రెండో రోజు పూర్తిగానే దూరంగా ఉన్నారు. పార్టీకి దూరమవుతూ వస్తున్న హరికృష్ణతో హోటల్ గదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ పార్లమెంటు సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు బుధవారంనాడు సుదీర్ఘ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications