2జి స్కామ్: కరుణానిధి సతీమణికి కోర్టు సమన్లు
తన ఆరోగ్యం సహకరించడం లేదనే కారణం చెబుతూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కేసులో దయాలు అమ్మాళ్ ముఖ్యమైన సాక్షి అని, 200 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కలైంగర్ టీవీకి ఆమె డైరెక్టర్గా ఉన్నారని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ అన్నారు.
టెలికం మాజీ మంత్రి ఎ రాజా, డిబి రియాల్టీ లిమిటెడ్ ఎండి వినోద్ గోయంకాలతో పాటు కరుణానిధి కూతురు, డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనమొళి, టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ విచారణను ఎదుర్కుంటున్న స్థితిలో దయాలు అమ్మాళ్కు కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
కేసు వాస్తవాలను, పరిస్థితిని బట్ిట దయాలు అమ్మాళ్ కేసులో ముఖ్యమైన సాక్షి అవుతారని, అందువల్ల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి ఆమెకు మినహాయింపు ఇవ్వలేమని న్యాయమూర్తి అన్నారు.