వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత, ధర్మానల కస్టడీకి మెమో: ఫ్యామిలీతో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy and Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలను జ్యూడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో శుక్రవారం మెమో దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 21వ తేదికి వాయిదా వేసింది. తమ కస్టడీకి అప్పగించమని కోరడంతో ధర్మాన, సబితల చుట్టు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లే కనిపిస్తోంది.

తప్పుపట్టిన సిబిఐ

తాము కేసు నుండి బయటపడతామన్న సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల వ్యాఖ్యలను సిబిఐ తప్పు పట్టింది. వారు కోర్టులను ప్రభావితం చేస్తారనేందుకు వారి వ్యాఖ్యలే నిదర్శనమని కోర్టుకు సిబిఐ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు దర్యాఫ్తులో ఉండగా కేసు నుండి బయటపడతామని ఎలా చెబుతారని సిబిఐ న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సిడిని సిబిఐ కోర్టుకు ఇచ్చింది.

కుటుంబంతో మాట్లాడేందుకు జగన్‌కు అనుమతి

ఈ కేసులో దాల్మియా ఛార్జీషీటుపై విచారణను కోర్టు వాయిదా వేసింది. జగన్ తదితరుల రిమాండును కోర్టు ఈ నెల 21వ తేది వరకు పొడిగించింది. కోర్టుకు వచ్చిన తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు గంటపాటు అనుమతించారు. పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చుని సూచించింది.

సిబిఐ తరఫున సురేంద్ర

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై వాదించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సురేంద్రను సిబిఐ నియమించింది. ఇప్పటి వరకు సురేంద్ర సత్యం కుంభకోణం కేసులో సిబిఐ తరఫున వాదిస్తున్నారు.

English summary
The CBI filed a petition in special court for Sabitha Indra Reddy and Dharmana Prasad Rao juducial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X