కోర్టుకు జగన్, సబిత: విజయ సాయికి స్పెషల్ కేటగిరి
సబిత కూడా హాజరవుతారు. దాల్మియా అంశానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో వీరు కోర్టుకు రానున్నారు. దాల్మియా వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీటును గత నెల కోర్టు విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకొని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందుతులు కోర్టులో హాజరై సమన్లు తీసుకోవాల్సి ఉంది.
జగన్, విజయ సాయి రెడ్డిలను అధికారులు కోర్టులో హాజరుపర్చుతారు. ఈ కేసులో పునీత్ దాల్మియా, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఈశ్వర్ సిమెంట్స్ ఎండి సజ్జల దివాకర్ రెడ్డి, సంజయ్ ఎస్.మిత్ర, నీల్ కమల్ బేరీ, రఘురామ్, దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులు హాజరు కానున్నారు.
విజయ సాయికి ప్రత్యేక కేటగిరి
బెయిల్ రద్దయి చంచల్గూడ జైలుకు చేరుకున్న విజయ సాయి రెడ్డికి కోర్టు స్పెషల్ కేటగిరి ఖైదీగా పరిగణించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఆయనను ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తూ అరెంజ్మెంట్స్ చేయాలని ఆదేశించింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని సాయి పిటిషన్ దాఖలు చేసుకోవడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేయనుంది.