పేరులోనే భారతి: జగన్ భార్యపై వర్ల, స్పీకర్పై అసంతృప్తి

పదిహేను మందిపై వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. "స్పీకర్ నిర్ణయం హర్షణీయం. కానీ, వారిపై వేటుకు ఇంత సమయం తీసుకోవడం సరి కాదు. పైగా అధికార పార్టీ పంచన చేరిన వారిని ఉపేక్షించడం ఎంత మాత్రం ప్రజాస్వామికం కాదు. వేణుగోపాలా చారి, చిన్నం రామకోటయ్య కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోలేదు.
హరీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ బహిరంగంగానే తెరాసలో చేరారు. అయినా వారిపై చర్య తీసుకోలేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉండాలంటే అందరిపైనా చర్య తీసుకోవాలి. స్పీకర్ రాగద్వేషాలతో వ్యవహరించరాదు. ఈ తీరును ఖండిస్తున్నాం. దీనిపై స్పీకర్ను కలుస్తాం'' అని ఆయన చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలపైనా వేటు వేయాలని కోరుతూ కౌన్సెల్ చైర్మన్ను కలుస్తామని తెలిపారు.
పేరు భారతి.. కానీ భారతీయం లేదు: వర్ల
జగన్ సతీమణి భారతి పేరులోనే భారతి ఉంది తప్ప.. ఆమెలో భారతీయం లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. భారతి నాంపల్లి కోర్టు వద్ద శుక్రవారం మాట్లాడిన మాటలు సరైనవి కావన్నారు. ఇదే న్యాయం, ఇదే దేశం, ఇదేం రాష్ట్రమంటూ ఆమె మాట్లాడటం సరికాదన్నారు. జగన్ అవినీతికి పాల్పడకపోతే ఇంతకాలం జైలులో ఉండేవారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications