వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం గీతారెడ్డికి, రోడ్లు పితానికి: ఎదురుపడ్డ బాబు, నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geeta Reddy - Pitani Satyanarayana
హైదరాబాద్: అసంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రి గీతా రెడ్డికి హోంశాఖ బాధ్యతలను, మరో మంత్రి పితాని సత్యనారాయణకు రోడ్లు, భవనాల శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పగించారు. ఇటీవలి వరకు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు ఆ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటుండటంతో రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గీతా రెడ్డి, పితానిలకు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

బ్రాహ్మణయ్య మృతికి సంతాపం

అంబటి బ్రాహ్మణయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, పేదల సమస్యలపై నిరంతరం పోరాడారన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దం అంబటి బ్రాహ్మణయ్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. బ్రాహ్మణయ్య ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన కుటుంబం నిరాడంబరంగా ఉందని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన పేరు శాశ్వతంగా ఉండేలా గ్రంథాలయం స్థాపించాలని, విగ్రహం పెట్టాలని ఇతర పార్టీల శాసనసభ్యులు కోరారు.

సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యాక కొద్ది రోజుల క్రితం మృతి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతికి సంతాపం తెలిపారు. రైతు సమస్యలపై బ్రాహ్మణయ్య రాజీలేని పోరాటం చేశారని, నీతికి, నిజాయితీకు ఆయన నిలువుటద్దమని, పెనుమూడి వారధి ఆయన కృషి వల్లనే వచ్చిందని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యారంగానికి ఎనలేని కృషి చేశారని, బ్రాహ్మణయ్య పేరు శాశ్వతంగా నిలిచేలా ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బాబు కోరారు. అంబటి బ్రాహ్మణయ్య మృతికి సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

ఎదురుపడ్డ నాగం, బాబు

తెలంగాణ కోసమంటూ తెలుగుదేశం పార్టీని వీడి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డికి శాసనసభ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదురయ్యారు. వారిద్దరు నవ్వుతూ ఒకరికొకరు పలకరించుకున్నారు. సమావేశాలకు డిఎల్ రవీంద్రా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి గైర్హాజరయ్యారు.

English summary
CM Kiran Kumar Reddy handed over Home to minister Geeta Reddy and R&B to Pitani Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X