కిరణ్ ఎన్నికల్లో పోటీ చేయరు, అమెరికాలో సెటిల్: డిఎల్
అందుకే ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని భావిస్తున్నారన్నారు. ఆయన సిఎం పదవి నుండి దిగిపోగానే అమెరికాలో వెళ్లాలనే యోచనలో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు కడప జిల్లాలో అభ్యర్థి దొరికే పరిస్థితి లేదన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కిరణ్ సోదరులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారని, అదే నిజమనిపిస్తోందన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ చేసిన ఓబుళాపురం గనుల పక్కనే ఉన్న రూ.వెయ్యి కోట్ల విలువైన ఖనిజ సంపదను మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి చెందిన ఎస్సార్ మినరల్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై తాను మంత్రి గల్లా అరుణ కుమారిని అప్రమత్తం చేశానని చెప్పారు.
అసెంబ్లీ అరగంట వాయిదా
మరోవైపు బుధవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.