పాక్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే భారత ప్రాజెక్ట్..! తాజా షాక్..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ (Pakistan) విషయంలో భారత్ (india) వేగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో గస్తీ నుంచి మొదలుపెడితే కీలక ప్రాజెక్టు వరకూ అస్సలు వెనక్కి తగ్గనంటోంది. ఇందుకు తగినట్లుగానే తాజాగా చేపడుతున్న ఓ కీలక ప్రాజెక్టు ఏకంగా పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. ఆ విషయాన్ని స్వయంగా పాకిస్తానే అంగీకరించింది. ఈ మేరకు తాజాగా భారత ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసింది.

చీనాబ్ నదిపై భారత్ ప్రాజెక్టులు

భారత్ సరిహద్దుల్లో చీనాబ్ నదిపై చేపడుతున్న తాజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పాకిస్తాన్ విమర్శలు గుప్పించింది. ఈ ప్రాజెక్టులు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇప్పటికే ఉన్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని కూడా అది పేర్కొంది. భారత్ మాత్రం ఇవేవీ పట్టించుకునే పరిస్ధితి లేదు. ప్రస్తుతం చీనాబ్ నదిపై రెండు ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని చీనాబ్-బియాస్ అనుసంధాన ప్రాజెక్ట్. మరొకటి జమ్మూలోని సలాల్ డ్యామ్‌కు సంబంధించినది. వీటి మొత్తం వ్యయం సుమారు రూ. 2,600 కోట్లు. ఈ ప్రాజెక్టులు నీటి ప్రవాహాన్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Pakistan Sounds Alarm Over India s Chenab-Beas Tunnel Calls It a Threat to Its Economy

పాకిస్థాన్ అభ్యంతరాలు (Pakistan)

చీనాబ్ నదిపై భారత్ చేపడుతున్న ప్రాజెక్టులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇవి ప్రధాన ఆందోళనకరమైన ప్రాజెక్టులని పేర్కొంది. భారత్ నీటిని ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించింది. ఈ ప్రణాళికల గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపింది. ఫలితంగా, ప్రస్తుత పరిస్థితిపై ఇస్లామాబాద్ తీవ్ర అసంతృప్తితో ఉందని వెల్లడించింది.

Pakistan Sounds Alarm Over India s Chenab-Beas Tunnel Calls It a Threat to Its Economy

ప్రాజెక్టులపై భారత్ వైఖరి

సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇప్పటికే భారత్ నిలిపివేసింది. పహల్గాం ఉగ్రవాద దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ కు దక్కాల్సిన వాటా నీటిని వినియోగించుకుంటామని ప్రధాని మోడీ తేల్చిచెప్పేశారు. అనంతరం ఈ నదీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశారు.చీనాబ్-బియాస్ నదుల అనుసంధానం నీటిని మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సైట్‌లో పనులు వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభమవుతాయి. జూలై 2029 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో, సలాల్ ప్రాజెక్ట్ భారీగా పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరిస్తుంది. ఈ కొత్త టన్నెల్ రిజర్వాయర్‌లోని పూడికను సమర్థవంతంగా తొలగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+