మూర్ఖుడిలా చంద్రబాబు: సాక్షి బ్యాన్పై జూపూడి

చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విఫలం కావడం వల్లనే చంద్రబాబు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నచ్చకపోతే చదవడం మానేయాలని, కానీ ఇలా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. ఇష్టం లేని మీడియాను మూయడం చంద్రబాబు తాతల వల్ల కూడా కాదని ఆయన అన్నారు.
సాక్షికి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకుండా అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు వెనుకాడలేదని ఆయన అన్నారు. ఈరోజు సాక్షిని అన్నవాళ్లు రేపు మరొకరిని అనబోరనే గ్యారంటీ ఏమీ లేదని ఆయన అన్నారు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై అవిశ్వాస తీర్మానం పెడతామని తెలుగుదేశం పార్టీ అనడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం విసరడమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి అన్నారు. నామ్ కే వాస్తేగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
సభను సజావు జరపడంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. సభను అడ్డుకున్న సభ్యులను సస్పెండ్ చేసేలా తీర్మానం చేయాలని ఆయన సూచించారు. ఫెడరల్ లేదా మూడో ఫ్రంట్ భాగస్వాములవుతామని అంటూ చంద్రబాబు పిలవని పేరంటానికి ఆరాటపడుతున్నారని మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకటి రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును ఎవరు చేర్చుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications