మోపిదేవికి ఛాతినొప్పి, ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ గత ఏడాదిలో జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన వాన్పిక్ అంశంలో అరెస్టయ్యారు.
మరోవైపు జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులలో నిందితులు ధర్మాన ప్రసాద రావు, కోనేరు మధు, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, బిపి ఆచార్య, శ్యామ్యూల్ తదితరులు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు.
విజయ సాయి పిటిషన్
విజయ సాయి, జగన్లను ఒకే జైలులో ఉంచవద్దని సిబిఐ పిటిషన్ పైన విజయ సాయి రెడ్డి ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ నెల 19న కోర్టుకు హాజరయ్యేలా జైలు అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. సిబిఐ మెమోపై కౌంటర్ వాదనలు వినేందుకు తనకు అనుమతివ్వాలని మెమో దాఖలు చేసారు.












Click it and Unblock the Notifications