వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై వైఖరి: చిరంజీవి మార్గంలోనే కావూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

kavuri sambasiva rao and chiranjeevi
న్యూఢిల్లీ: కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత మెతగ్గా మారినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగి చిరంజీవి కూడా మంత్రి పదవి దక్కిన తర్వాత తన వైఖరికి మార్చుకున్నారు. లోలోన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నప్పటికీ బయటకు మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరంజీవి చెబుతూ వచ్చారు. ఇప్పుడు కావూరి సాంబశివ రావు అదే మాట అన్నారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై తాను ఇంత వరకు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమని, ఇపుడు కేంద్ర మంత్రిగా విశాలదృక్పథంతో ముందుకు సాగుతానని కేంద్ర జౌళిశాఖామంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై తన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఇకపై మాత్రం కేంద్ర మంత్రిగా విశాల జాతీయ దృక్పథంతో పనిచేస్తానని చెప్పారు.

తెలంగాణ అంశం ఎఐసిసి పరిధిలో ఉందని చెప్పారు. అందువల్ల పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా గౌరవించాలని ఆయన అన్నారు. తనపై విశ్వాసముంచి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించినందుకు సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్, రాహుల్‌గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు.

కాస్త ఆలస్యంగానైనా తన సమర్థతను గుర్తించి కేబినెట్ హోదా కట్టబెట్టినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే యుపిఎ ప్రభుత్వ పదవీ కాలం మరో యేడాది కూడా లేకపోవడంతో ఈ తక్కువ సమయంలోనే తన ఆలోచనలు అమలు చేసేందుకు కృషి చెస్తానని ఆయన చెప్పారు. తనకు పని చేయడం అలవాటు అని ఆయన చెప్పారు.

English summary
The union minister Kavuri Sambasiva Rao has said that everybody should abide by Congress high command dicision on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X