జగన్తో లింక్ లేదు: సాక్షి డైలీపై కిరణ్ మండిపాటు

వైయస్ జగన్ కేసులో తమ మంత్రులపై వచ్చిన ఆరోపణలపై తాను చెప్పిన మాటలను వక్రీకరిస్తూ తాను కేసే లేదన్నట్లుగా మాట్లాడినట్లు సాక్షి డైలీ చిత్రీకరించిందని ఆయన అన్నారు. తాము ఒక పార్టీలోనే కొనసాగుతామని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హయాంలోని ఐఎంజి వ్యవహారాన్ని తానే సభలో లేవనెత్తానని, ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిందని, సిబ్బంది లేకపోవడంతో సిబిఐ దాన్ని దర్యాప్తునకు తీసుకోలేదని, ఇప్పటికి కూడా సిబిఐ దర్యాప్తునకు అడగవచ్చునని ఆయన అన్నారు.
తాను సీనియర్ సభ్యుడిని అంటే సరిపోదని, సభలో వారి నుంచి కొత్త సభ్యులు నేర్చుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. పరస్పరం దూషించుకుంటున్నప్పుడు మన స్థాయిని తగ్గించుకుంటున్నామని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చార్జిషీట్లలో తమ పేర్లను సిబిఐ చేర్చిన తర్వాత మంత్రులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. క్విడ్ ప్రోకో అంశం మంత్రులపై రాలేదని, మంత్రులు తీసుకున్న నిర్ణయాల వల్ల వేరేవారికి లబ్ధి చేకూరిందనే అంశంపై చర్చ సాగుతోందని తాను చెప్పినట్లు ఆయన వివరించారు. తాను వేరేవాళ్ల ప్రస్తావన తేలేదని ఆయన చెప్పారు. అయినా సాక్షి డైలీ తన మాటలను వక్రీకరించిందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని, ఈ స్థితిలో పెట్టుబడులు తీసుకోవడం నైతికమా, అనైతికమా అనే చర్చ సాగుతోందని ఆయన అన్నారు. మంత్రులు ప్రలోభాలకు లోను కాలేదని, మంత్రులకు ఆ విషయంలో మేళ్లు జరగలేదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై మాట్లాడలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి వివరణ తర్వాత మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బంగారుతల్లి పథకం బిల్లును శాసనసభలో ప్రతిపాదించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications