వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై చర్చలు: చాకో, కాంగ్రెసు డ్రామా: కోదండ

By Pratap
|
Google Oneindia TeluguNews

PC Chako and Kodandaram
న్యూఢిల్లీ/ ఆదిలాబాద్: తెలంగాణపై క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఢిల్లీలో జరుగుతున్నాయని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పారు. బీహార్ శానససభలో జెడియు విశ్వాస తీర్మానం నెగ్గడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్‌జెడి తమకు మిత్రపక్షమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. భవిష్యత్తు పొత్తులను తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

తమకు ప్యాకేజీలు వద్దని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశం ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే పార్టీ అధిష్టానంతో కొట్లాడాలని ఆయన సూచించారు.

జూలై 4వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులను పల్లెల్లో తిరగనీయకుండా చేస్తామని ఆయన చెప్పారు. బైండోవర్ల పేరుతో కేసులు నమోదు చేశారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడిని నిర్వహిస్తే తెలంగాణ ప్రజలను హైదరాబాద్ రాకుండా బైండోవర్లు చేసి అడ్డుకున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
AICC spokesperson PC Chako said that discussions on Telangana issue are continuing. Meanwhile Telangana political JAC chairman Kodandaram said that they will reject packages for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X