ఒక్క రోజు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు: చిరుపై ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది అసమర్థ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ వీడి పార్లమెంటులో తెంలగాణ కోసం పోరాడాలని ఆయన అన్నారు.
ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆర్సీ శశాంక్ గోయల్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వరదబాధితుల కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తొలగించడం తప్పేనని ఆయన అన్నారు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఉత్తరాఖండ్ యాత్రకు రాష్ట్రం నుంచి ఎంత మంది వెళ్లారనేది కచ్చితమైన వివరాలు లేవని మంత్రులు శ్రీధర్ భాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మానవతా దృక్పథంతో సేవ చేస్తే తప్పు లేదని, రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇది సమయం కాదని వారన్నారు. యాత్రికులను వదిలేసి వచ్చిన ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని వారన్నారు.