వరదలు: భజ్జీ 10 లక్షల విరాళం, తన వంతుగా ధావన్

బాధితుల కష్టాలు స్వయంగా చూసిన భజ్జీ వారికి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాను పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు తాను దీనిని అందజేస్తానని పిటిఐతో భజ్జీ చెప్పారు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆ మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు ఇస్తానని ప్రకటించాడు.
కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు నివేదికలు సమర్పించనున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొని బయటపడిన పలువురు ఆంధ్ర ప్రదేశ్ భక్తులు ఇళ్లకు చేరుకున్నారు.
కేదార్నాథ్ ఆలయంలోని మృతదేహాల వెలికితీతకు వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ నుంచి శవాలను వెలికితీసి వాటి అంత్యక్రియలను నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీ స్థాయిలో మూడు క్వింటాళ్ల చందనం, 21 క్వింటాళ్ల దేవదారు కలప, 1500 లీటర్ల ఆవు నెయ్యి, ఒక క్వింటాలు కర్పూరం కేదార్ నాథ్కు తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications