నలుపు దుస్తులతో విచారణకు శంకరన్న, కిరణ్పై మళ్లీ

కాగా శంకర రావుకు సైఫాబాద్ పోలీసులు రెండుసార్లు నోటీసులను ఇచ్చారు. మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ శంకర రావు అనారోగ్యం పేరుతో విచారణకు హాజరు కాలేదు. మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు.
విచారణకు హాజరయ్యే ముందు ఆయన మాట్లాడుతూ తాను శంకర రావుకు బదులు శంకర్ రెడ్డి అయి వుంటే బాగుండేదని, శంకర రావు కాబట్టే తనపై కేసు పెడుతున్నారని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
ఎపి భవన్లో తెలుగుదేశం పార్టీ వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడం సరికాదని ఆయన అన్నారు. జూలై 1 లోగా తెలంగాణ వస్తుందని తన అంతరాత్మ చెబుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
గాలి బెయిల్ స్కాం కేసులో..
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో చర్లపల్లి జైలులో ఉన్న యాదగిరిని విచారించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ రోజు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు ఈడి యాదగిరిని చర్లపల్లి జైలులో విచారించనుంది.












Click it and Unblock the Notifications