దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే?
బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో మెర్సీ సత్యరాణి ఏడో అంతస్థులోని కిటికీ తెరిచి అక్కడి నుంచి కిందికి దూకిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. భవనంపై నుంచి దూకే ముందు తనకు సంబంధించిన వస్తువులను అన్నింటినీ పక్కన పెట్టేసిందని చెబుతున్నారు.
భోజన విరామ సమయంలో మధ్యాహ్నం చాలా ఆందోళనగా కనిపించిందని, సాయంత్రం కూడా ఏమీ తినలేదని అంటున్నారు. లంచ్ బాక్స్ తెరిచిన సమయంలోనే ఆమెకు బయటి నుంచి ఓ ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె బల్ల నుంచి దూరంగా వెళ్లిపోయి ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయింది. సంబంధంలో తలెత్తిన సమస్యే అందుకు కారణమని భావిస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
మెర్సీ సత్యరాణి 2009 నుంచి ఆ సంస్థలో అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేస్తోంది. మెర్సీ తన తండ్రి దేవదాసన్ జాన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, మెర్సీ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని, పోలీసులకు అవసరమైన సహాయం అందిస్తామని పోలారిస్ అధికార ప్రతినిధి చెప్పారు.