వారంలో తెలంగాణకు పరిష్కారం: దిగ్విజయ్ కీలకవ్యాఖ్య
వారం పదిరోజుల్లో తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... ఇరు ప్రాంత నేతలు దానికి కట్టుబడి ఉంటాలని ఆయన సూచించారు. అన్నీ ఆలోచించే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కోర్ కమిటీ భేటీలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని, కోర్ కమిటీ ప్రత్యేక సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఆహ్వానిస్తామన్నారు. కాగా సమావేశంలోని నేతలెవరు ప్రస్తావించకుండానే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్, బాబు, కాంగ్రెసు కుమ్మక్కు: కిషన్
రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి దురుద్దేశ్యం, పక్షపాతం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. చిత్తూరు జిల్లాలోని ఈ రోజు నుండి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి వచ్చిన ఆయన మాట్లాడారు.
తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు నాయకులు తెలంగాణ సాధన సభ పెట్టడంలో అర్థం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు అధికార కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.