డిఎన్ఏ మనదే: వైయస్ను, జగన్ను పోల్చిన దిగ్విజయ్
వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాల్లో తేడా ఉందని వ్యాఖ్యానించారు. వైయస్ ఓపిగ్గా రాజకీయాలు చేసేవారని, జగన్ మాత్రం ఉండలేకపోయారన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీలోను కాంగ్రెసు డిఎన్ఏ ఉందన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని దిగ్విజయ్ చెప్పారు.
వైయస్ వేరు, జగన్ వేరు అన్నారు. వైయస్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు మానుకోవాలని సూచించారు. మనం ఐక్యంగా ఉంటే పార్టీని ఎవరూ ఓడించలేరన్నారు. కార్యకర్తలు అంతా కాంగ్రెసును తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
కాగా దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలతో భేటీ అయ్యారు. ఆయనతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, శైలజానాథ్ తదితరులు భేటీ అయ్యారు.