టిజికి గన్ పట్టే అలవాటు లేదు, మాకు ఉంది: పొన్నం
తెలంగాణ సాధనే లక్ష్యం: కోదండ
తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఐకాస చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బిజెపి, టిఆర్ఎస్, జనతా పార్టీ, సోషలిస్టు, బోడో ల్యాండ్, జెఎంఎం, అమ్ ఆద్మీ, ఎంసిపి, ఆర్ఎల్డీ, ఐజెపి, సిపిఎం న్యూడెమోక్రసీ, జమ్ము కాశ్మీర్ ప్యాంతర్స్ పార్టీలు హాజరయ్యాయి.
బిజెపి నుండి దత్తాత్రేయ, టిఆర్ఎస్ నుండి కె కేశవ రావు, వివేక్, ఆర్ఎల్డీ నుండి కెఎస్ మాన్, రియాజ్, సిపిఐ నుండి అజీజ్ భాషాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని, పోరాటం సాగిస్తామని, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మాట నిలబెట్టుకోలేక పోయిందన్నారు. కాంగ్రెసు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రాణత్యాగాలు ప్రజాస్వామానికే అవమానమన్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ నేత డి.రాజా అన్నారు. తెలంగాణకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు. తెలంగాణపై ప్రకటన చేస్తే ఉద్యమాలు ఉండవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రంపై అధారాపడి ఉందన్నారు.