ఫంక్షన్హాల్పై దాడి: కెసిఆర్పై అన్నకూతురు రమ్య ఫైర్
మంగళవారం బషీర్బాగ్లో జరిగిన 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వెళ్లానని ఆమె తెలిపారు. అక్కడ తన ఎడమ కాలి చెప్పు అడిగితే ఇచ్చానన్నారు. ఈ కారణంగానే కెసిఆర్ తన ఫంక్షన్ హాల్పై దాడి చేయించారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
తెలంగాణ రాక ముందే కెసిఆర్ ఇలా ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రవర్తన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు ఊహించుకోవాలని ఆమె అన్నారు. డిజిపిని కలిసి కెసిఆర్పై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటన కెసిఆర్ విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఆమె అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోదరుని కూతురు, టిఆర్ఎల్డీ నేత రమ్య ఫంక్షన్ హాల్ పైన తెలంగాణవాదులు బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.