వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య ప్రకటన చేస్తే కాంగ్రెస్‌కు 25 ఎంపీ సీట్లు: గంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganta Srinivasa Rao
విశాఖపట్నం/ న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేస్తే తాము కాంగ్రెసు పార్టీకి 25 పార్లమెంటు సీట్లు గెలిపించి ఇస్తామని, ఈ మేరకు తాము పార్టీ అధిష్టానానికి హామీ ఇవ్వదలుచుకున్నామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన సమైక్యాంధ్ర సమావేశంలో ఆయన శుక్రవారంనాడు పాల్గొన్నారు. తెలంగాణ ఇస్తే 15 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామని తెలంగాణ నాయకులు పార్టీ అధిష్టానానికి హామీ ఇస్తున్నారని, అదే తీరులో తాము అధిష్టానానికి హామీ ఇవ్వదలుచుకున్నామని ఆయన అన్నారు

శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతుందని, సమైక్యవాదమే గెలుస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం గురించి ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు చెప్పామని, అంతకు ముందు కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్పామని ఆయన అన్నారు.

విభజన వివాదంపై ప్రతిష్టంభన తొలగించాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ పదే పదే చెప్పారని ఆయన అన్నారు. ఈ స్థితిలో సమైక్యవాదాన్ని వినిపించడానికి సీమాంధ్రలో సభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. తొలుత అనంతపురంలో ఈ నెల రెండో వారంలో సభ నిర్వహిస్తామని, రాయలసీమ ప్రజలు రాయల తెలంగాణ కోరుకోవడం లేదనే విషయాన్ని ఈ సభ ద్వారా చాటి చెప్తామని ఆయన అన్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలోనూ హైదరాబాదులోనూ సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెసును ఈ ప్రాంతాల ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు.

దిగ్విజయ్‌తో కోదండరామ్ టీమ్ భేటీ

తెలంగాణపై త్వరలోని నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ జెఎసి నేతలు శుక్రవారం దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆ తర్వాత కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రజలకు చెప్పాలని దిగ్విజయ్ సింగ్ తమకు సూచించినట్లు ఆయన తెలిపారు .

తెలంగాణపై బిల్లును ప్రతిపాదించే వరకు తాము ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తాము దిగ్విజయ్ సింగ్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తెలంగాణ అంశాన్ని కోర్ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు విహెచ్ తెలిపారు.

English summary
The minister from Seemandhra Ghanta Srinivas Rao said that if congress high command announces Unified Andhra, the party will win 25 MP seats from Andhra and Rayalaseema regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X