వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త మలుపు: ఇష్రాత్ జహాన్ మానవ బాంబా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ishrat Jahan
న్యూఢిల్లీ: ఇష్రాత్ జహాన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇష్రాత్ జహాన్ మానవ బాంబు అని డేవిడ్ కోలెమన్ హెడ్లీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణలో వెల్లడించినట్లు శుక్రవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. డేవిడ్ హెడ్లీ ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకతను.

గుజరాత్ పోలీసులు జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇష్రాత్ జహాన్ ఓ మానవ బాంబు అని హెడ్లీ వెల్లడించిట్లు చెబుతున్నారు. ఇష్రాత్ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని సిబిఐ తన చార్జిషీట్‌లో చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం సంచలనాన్ని సృష్టిస్తోంది.

ఇష్రాత్ జహాన్‌కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు హెడ్లీ చెప్పినట్లు సమాచారం. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కమాండర్ జహీవుర్ రెహ్మాన్ లఖ్వీ పన్నిన వ్యూహం ఇష్రాంత్, మరో ముగ్గురి మృతితో విఫలమైందని హెడ్లీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వార్తా కథనాలకు కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ ప్రతిస్పందించారు. ఇష్రాత్ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా, లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన హోం మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. ఇష్రాత్ జహాన్ కేసులో అనధికారికంగా ఎంపిక చేసిన విషయాలను వెల్లడించడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ఇష్రాత్ జహాన్‌ను జనతాదళ్ (యు) నేత అలీ అన్వర్ బీహార్ పుత్రికగా అభివర్ణించారు. ఆమెకు న్యాయం చేయాలని కోరారు. జహాన్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని సిబిఐ చెప్పిందని ఆయన అన్నారు. ఈ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు పాత్ర ఉందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు

English summary
In a major twist in the Ishrat Jahan case, Mumbai attack terrorist David Coleman Headley has reportedly said that the 19-year-old Mumbra girl, who was gunned down in an alleged fake encounter in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X