కొత్త మలుపు: ఇష్రాత్ జహాన్ మానవ బాంబా?
గుజరాత్ పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఇష్రాత్ జహాన్ ఓ మానవ బాంబు అని హెడ్లీ వెల్లడించిట్లు చెబుతున్నారు. ఇష్రాత్ జహాన్కు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని సిబిఐ తన చార్జిషీట్లో చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం సంచలనాన్ని సృష్టిస్తోంది.
ఇష్రాత్ జహాన్కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు హెడ్లీ చెప్పినట్లు సమాచారం. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కమాండర్ జహీవుర్ రెహ్మాన్ లఖ్వీ పన్నిన వ్యూహం ఇష్రాంత్, మరో ముగ్గురి మృతితో విఫలమైందని హెడ్లీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఈ వార్తా కథనాలకు కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ ప్రతిస్పందించారు. ఇష్రాత్ జహాన్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా, లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన హోం మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. ఇష్రాత్ జహాన్ కేసులో అనధికారికంగా ఎంపిక చేసిన విషయాలను వెల్లడించడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతోందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఇష్రాత్ జహాన్ను జనతాదళ్ (యు) నేత అలీ అన్వర్ బీహార్ పుత్రికగా అభివర్ణించారు. ఆమెకు న్యాయం చేయాలని కోరారు. జహాన్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని సిబిఐ చెప్పిందని ఆయన అన్నారు. ఈ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు పాత్ర ఉందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు