టోరంటో విమానాశ్రయంలో భారత నటికి అవమానం
కోల్కతా: విదేశాల్లో అవమానాలకు గురవుతున్న సినీ నటుల సంఖ్య పెరుగుతోంది. కమల్ హాసన్, షారూక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ వంటి నటులు విదేశీ విమానాశ్రయాల్లో వేధింపులకు గురయ్యారు. తాజాగా రీతుపర్ణ సేన్గుప్తా అనే సినీ నటి కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో అవమానానికి గురైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత అయిన తీరుపర్ణను టోరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారంనాడు ఐదున్నర గంటల పాటు విచారించారు.
టోరంటో విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకోగానే రీతుపర్ణకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆనందబజార్ పత్రిక రాసింది. 2015 వరకు చెల్లే వీసా ఉన్నప్పటికీ దాని కాలపరిమితి ముగిసిందని ఆమెకు చెప్పారు. ఆమె వ్యక్తిగత సామాన్లను సోదా చేశారు. మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు.

దాంతో ఆమె కష్టాలు తీరలేదు. అవమానానికి గురై ఏడిస్తే మానసిక రోగిగా ఆమెకు ముద్ర వేశారు. ఆస్పత్రికి పంపిస్తామని బెదిరించారు. వీసా గడువు ముగిసినందున కెనడాలో అడుగు పెట్టనివ్వమని తనకు చెప్పారని, కానీ గడువు ఉందని రీతూపర్ణ చెప్పారు. దాంతో తన వీసా గడువు ముగిసినట్లు ఏమైనా పత్రాలున్నాయా చూపించాలని తాను అడిగానని ఆమె చెప్పింది.
చివరకు బంగా సమ్మేళన్కు హాజరు కావడానికి కెనడాలో అడుగు పెట్టడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ సమ్మేళన్లో ఆమె చిత్రం ముక్తి ప్రదర్శించారు. ఆమెతో పాటు కెనడాలోనే ఉండే ఆమె అత్తగారింటి తరఫు 80 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. అయినా ఆ వేధింపులు తప్పలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications