టోరంటో విమానాశ్రయంలో భారత నటికి అవమానం
కోల్కతా: విదేశాల్లో అవమానాలకు గురవుతున్న సినీ నటుల సంఖ్య పెరుగుతోంది. కమల్ హాసన్, షారూక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ వంటి నటులు విదేశీ విమానాశ్రయాల్లో వేధింపులకు గురయ్యారు. తాజాగా రీతుపర్ణ సేన్గుప్తా అనే సినీ నటి కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో అవమానానికి గురైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత అయిన తీరుపర్ణను టోరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారంనాడు ఐదున్నర గంటల పాటు విచారించారు.
టోరంటో
విమానాశ్రయానికి
మధ్యాహ్నం
చేరుకోగానే
రీతుపర్ణకు
వేధింపులు
ప్రారంభమయ్యాయని
ఆనందబజార్
పత్రిక
రాసింది.
2015
వరకు
చెల్లే
వీసా
ఉన్నప్పటికీ
దాని
కాలపరిమితి
ముగిసిందని
ఆమెకు
చెప్పారు.
ఆమె
వ్యక్తిగత
సామాన్లను
సోదా
చేశారు.
మొబైల్ను
స్వాధీనం
చేసుకున్నారు.
దాంతో ఆమె కష్టాలు తీరలేదు. అవమానానికి గురై ఏడిస్తే మానసిక రోగిగా ఆమెకు ముద్ర వేశారు. ఆస్పత్రికి పంపిస్తామని బెదిరించారు. వీసా గడువు ముగిసినందున కెనడాలో అడుగు పెట్టనివ్వమని తనకు చెప్పారని, కానీ గడువు ఉందని రీతూపర్ణ చెప్పారు. దాంతో తన వీసా గడువు ముగిసినట్లు ఏమైనా పత్రాలున్నాయా చూపించాలని తాను అడిగానని ఆమె చెప్పింది.
చివరకు బంగా సమ్మేళన్కు హాజరు కావడానికి కెనడాలో అడుగు పెట్టడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ సమ్మేళన్లో ఆమె చిత్రం ముక్తి ప్రదర్శించారు. ఆమెతో పాటు కెనడాలోనే ఉండే ఆమె అత్తగారింటి తరఫు 80 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. అయినా ఆ వేధింపులు తప్పలేదు.