బొత్స గురువును 'ముంచిన' శిష్యుడు: షర్మిల ఎద్దేవా
గురువును మించిన శిష్యుడు అయితే ఏ గురువైనా సంతోషిస్తారని, కానీ బొత్స గురువును ముంచిన శిష్యుడయ్యాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ప్రభుత్వంతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారు.
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లేకుంటే బొత్స అనే వ్యక్తే లేరన్నారు. కానీ ఆయన ఇఫ్పుడు ఆయన కుటుంబం పైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ త్వరలో బయటకు వస్తారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని, తద్వారా సుపరిపాలన అందుతుందని, ఆ ఓటు జగన్ నిర్దోషిగా చెప్పేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.