వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ మహిళలపై లైంగికదాడులు పెద్ద మచ్చ: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులపై దాడులు దేశానికి మాయని మచ్చ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం అన్నారు. విదేశీ పర్యాటకుల భద్రతపై చిరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విదేశీ పర్యాటకులపై జరిగిన కొన్ని లైంగిక దాడులు విస్తృతంగా ప్రచారమై భారత దేశం పైన చెడు ప్రభావాన్ని చూపాయన్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని ఆయన తెలిపారు.

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతిభద్రతల పైన దృష్టి సారించాలన్నారు. పర్యాటకులందరికీ స్నేహ పూర్వకమైన వాతావరణం కల్పించాలని, తాను ఇటీవలె ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. గత దశాబ్దకాలంగా పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తోందన్నారు.

2012లో విదేశీ పర్యాటకుల సంఖ్య 65.80 లక్షలకు చేరిందన్నారు. దేశీయ పర్యాటకుల సంఖ్య 10.27 కోట్లుగా ఉందన్నారు. ప్రపంచ దేశాల కంటే భారత్‌లోనే పర్యాటకరంగ వృద్ధి అధికంగా ఉందన్నారు. అంతర్జాతీయ పర్యాటకరంగంలో మన వాటా 0.64 గా ఉందని, దీనిని పెంచుకోవాల్సి ఉందన్నారు.

దేశంలోని పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలు, భద్రత పెంచాల్సి ఉందన్నారు. కార్పోరేట్ సంస్థలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు, స్మారకాలను దత్తత తీసుకొని సంరక్షించాలని సూచించారు. కొన్నింటిని దత్తత తీసుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.

English summary
Safety of tourists, particularly foreign women, is a concern for the government, and the states have been told to create a congenial and friendly atmosphere for visitors, union Tourism Minister Chiranjeevi said Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X