జగన్ కేసు: ఐఎఎస్ల ప్రాసిక్యూషన్పై హైకోర్టు నోటీసులు

ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్కు అనుమతించాలని కోరుతూ కుటుంబ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. వైయస్ జగన్ ఆస్తులు, ఒఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుల్లో ఆరుగురు ఐఎఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వారిలో శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్కు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మిగతా ఐదుగురి విషయాన్ని పెండింగులో పెట్టింది.
ఐదుగురు ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులోనే కాకుండా ఒఎంసి కేసులో కూడా శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉంది. ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల విచారణలో కూడా జాప్యం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసి ఏడాది దాటుతోంది. ఒఎంసి కేసు విచారణ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కొన్ని చార్జిషీట్లను దాఖలు చేసింది. వాటిపై కూడా విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications