సర్వే: లోకసభ ఎన్నికల్లో దీదీ హవా, తగ్గినా నితీష్ 'ప్రభ'

2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో యుపి తరవాత కీలక భూమికను పోషించే అవకాశమున్న పశ్చిమ బెంగాల్లో 42, బీహార్లో 40 లోకసభ స్థానాలు ఉన్నాయి. బెంగాల్లో దీదీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లో మాత్రం జెడి(యు) సీట్లు తగ్గే అవకాశముంది. అయితే బిజెపి-జెడి(యు) మధ్య బంధం తెగిపోవడమే అందుకు కారణం.
ప్రస్తుతం జెడి(యు)కు బీహార్లో 20 ఎంపీ స్థానాలున్నాయి. బిజెపి-జెడి(యు)ల మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో జెడి(యు) 15-19 సీట్లలో గెలిచే అవకాశముంది. బిజెపి సీట్ల సంఖ్య 8-12 స్థానాలకు పరిమితం కానుంది. అయితే ఓటింగ్ శాతం మాత్రం పెరుగనుంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టడం ఆర్జేడికి కలిసి వస్తుంది. ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది. సీట్లు మాత్రం బిజెపితో సమానంగా వచ్చే అవకాశముంది. పాశ్వాన్ పార్టీ రెండు స్థానాల వరకు గెలువొచ్చు.
పశ్చిమ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెసు పార్టీ 23-27 సీట్లను గెలుచుకోనుంది. అయితే ఓటింగ్ మాత్రం ఒక్క శాతమే పెరుగనుంది. 2009లో లెఫ్ట్ కూటమి సీట్లు 15 కాగా, ఇప్పుడు అది ఏడు నుండి 11కు పడిపోనుంది. కాంగ్రెసుకు 5-9, బిజెపికి రెండు సీట్ల వరకు రావొచ్చు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications