అనుమానం: భార్యను వెంటాడి రోడ్డుపై నరికాడు

గజేంద్ర నగర్లోని దీప తల్లిగారింట్లో భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్ అయిన బాబు దీపపై దాడి చేసిన తర్వాత పారిపోయాడు. హత్యాప్రయత్నం కింద బ్యాపనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి బాబు కోసం గాలిస్తున్నారు.
బాబు, దీప ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దాంతో వారికి పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోయినా వారు వివాహం చేసుకున్నారు. బ్యాపనహళ్లిలోని అద్దె ఇంట్లో వారు తమ పిల్లలు పార్వతి (5), భరత్ (3)లతో కలిసి ఉంటున్నారు.
భార్యపై అనుమానం వచ్చి బాబు గొడవ పడుతూ వచ్చాడని, దాంతో ఇరువురి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, బాబు మద్యానికి అలవాటు పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వేధింపులపై దీప ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications