భోజనాలు లేక కౌంటింగ్ ఆలస్యం: దేవినేని అరెస్ట్, ఉద్రిక్తం

కాగా అంతకుముందు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ముగిసింది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డు మెంబర్స్, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు.
దేవినేని అరెస్ట్
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో రీపోలింగ్ నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఒకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడంతో భారీగా మోహరించిన పోలీసులు దేవినేని ఉమ సహా పలువురిని అరెస్ట్ చేశారు.
మధ్యాహ్నం ఒకటి గంటల వరకు వరుసలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు అనుమతిస్తున్నారు. కొన్నిచోట్ల గుర్తులు తారుమారు కావడం, అభ్యర్థులు లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. తమ ఓట్లు గల్లంతు కావడం, దొంగ ఓట్లు వేస్తుండటం తదితర కారణాల వల్ల పలుచోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాల పైన దాడి చేయడం, ఓటింగును అడ్డుకోవడం చేశారు.
ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications