వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ టీ నేత ధ్వజం: దుర్మార్గమన్న మేకపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

KK Mahender Reddy - Mekapati
హైదరాబాద్: తెలంగాణపై పార్టీ నాయకత్వం తీరుపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ సీమాంధ్ర ప్రాంత శానససభ్యులు రాజీనామాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై, జగన్‌పై అభిమానంతో తాము పార్టీలోకి వచ్చామని, తెలంగాణ ఆత్మాభిమానంతో అసంతృప్తి ఉన్నామని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ ప్లీనరీలో చెప్పినదానికి కట్టుబడి ఉండకపోవడం వల్లనే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీలో కొందరు ఆత్మవంచన చేసుకుంటుంటే, కొందరు ఆత్మ విమర్స చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి ఇచ్చిన లేఖకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర శానససభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు వైఖరి చెప్పాలని అడిగింది తమ పార్టీనే అని, కాంగ్రెసు వైఖరి చెప్పకముందే తమ పార్టీవారే రాజీనామాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు వైఖరి వెల్లడైన తర్వాత తెలంగాణ నాయకులను కూడా కలుపుకుని కార్యాచరణ రూపొందించుకుంటే బాగుండేదని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయబోతున్నారనేది ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణపై ఏం చేస్తారనేది తెలియడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్సించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని, అవమానిస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

ప్రజలను కాంగ్రెసు పార్టీ గందరగోళ పరుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏం చేస్తారనేది అధికారికంగా ప్రకటించలేదని ఆయన అన్నారు. కొండా దంపతులు తమతోనే ఉంటారని ఆయన అన్నారు. పార్టీలో ఎవరికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెసు ఆడుకుంటోందని ఆన అన్నారు. విభజన ప్రభావం అన్ని పార్టీలపై ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనే విషయాన్ని పత్రికల్లోనే చూశానని చెప్పారు.

తమ పార్టీ నేత షర్మిల పాదయాత్ర 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని, ఈ సందర్భంగా జరిగే ముగింపు సభకు నాయకులంతా హాజరు కావాలని ఆయన అన్నారు. ఓ మహిళా నేత ఇంత సుదీర్ఘ యాత్ర చేయడం అవూర్వమని ఆయన అన్నారు. షర్మిల 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుంది.

English summary
The YSR Congress party Telangana leader KK Mahender Reddy lashed out at party leadership. Meanwhile, party MP Mekapati Rajamohan Reddy lashed out at Congress on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X