విజయమ్మ తూట్లు, సిఎం తప్పుకుంటారేమో: టిజి
రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అనుకుంటున్నారని, దానివల్ల విభజనకు నిర్ణయం జరిగితే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగరని అనుకుంటున్నానని ఆయన వివరించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తారని, విభజనలో తాను భాగస్వామిని కాలేనని చెప్పారని, తాను తెలంగాణ భూమిపుత్రుడిని అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, విభజన జరిగితే నిజంగానే బాధపడుతారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విభజనను కోరిన పార్టీలకు ప్రజలు ఓటేశారని, అలా జరగకపోతే కాంగ్రెసు అధిష్టానానికి సంకేతాలు వేరుగా వెళ్లేవని ఆయన అన్నారు. విభజన జరిగితే అందుకు ప్రజానీకం, పార్టీలు బాధ్యత వహించాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో విభజనపై చర్చలు ముగిశాయని, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
విభజన అనివార్యమైతే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారు కూడా అంగీకరిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, విభజన జరగకూడదని తాము భావిస్తున్నామని, విభజనను అడ్డుకోవడానికి చాలా కష్టపడ్డామని మంత్రి అన్నారు. విభజన జరిగితే తాము ఎవరి మోచేతి నీళ్ల మీద బతకాలని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.