బాబు, జగన్ రాహుకేతువులు: విభజనపై వీరశివా

రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు భూస్థాపితం అవుతుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చీమూనెత్తురు ఉంటే సీమాంధ్ర నాయకులు సమైక్యవాదాన్ని వినిపించాలని, లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. సమైక్యవాదం వినిపించని మంత్రులు, పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెసుకు 20 లోకసభ స్థానాలను సాధించి పెడుతామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజన ప్రయత్నాలను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఆదివారంనాడు హైదరాబాదులోని తెలుగుతల్లి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుజాతిని విభజించడానికి అంగీకరించబోమని విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లక్షమందితో నవంబర్ 1వ తేదీన హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఆగస్టు 4వ తేదీన విశాలాంధ్ర మహాసభ సమావేశం జరగనుంది. రాష్ట్రాన్ని విభజన దిశగా రాజకీయ శక్తులను తీసుకుని వెళ్తున్నాయని, ఆ శక్తులను ఆపడానికి తగిన బలాన్ని ఇవ్వాలని తెలుగుతల్లి ఆశీస్సులు తీసుకుంటున్నామని ప్రభాకర్ అన్నారు. తెలుగు జాతి సమైక్యతను కాపాడడానికి నడం బిగించని పార్టీలు, నాయకత్వాలు తెలుగుతల్లి శాపానికి గురువుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications