హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో లేడీ టెక్కీ ఆత్మహత్య: లాడ్జిలో ఉరి వేసుకుని..

By Pratap
|
Google Oneindia TeluguNews

Another lady techie commits suicide
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. లాడ్జి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనతో సహజీవనం చేసిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఇటీవలే అలేఖ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.

తాజాగా లక్డీకా పూల్‌లోని హిల్ పార్క్ హోటల్ గదిలో టెక్కీ ఉరేసుకుని మరణించింది. ఆమె ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చినట్లు హోటల్ సిబ్బందికి చెప్పి గదిని బుక్ చేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి ఆదయం వరకు ఆమె ఉన్న గది తలుపులు తెరవలేదు. దీంతో హోటల్ సిబ్బంది యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు గది తలుపులు తెరిచి చూశారు. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలు హయత్‌నగర్ ప్రాంతంలోని రాఘవేంద్ర కాలనీకి చెందన పల్లవి కావచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె బెంగళూర్ నుంచి వచ్చి ఉండే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

బలపరిచిన అభ్యర్థి ఓడాడని ఆత్మహత్య

తాను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందలేదని కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మూటపెల్లికి చెందిన దొమ్మాటి నర్సయ్య (50) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గుండ రాధను ఆమె భర్త లచ్చంగౌడ్ సర్పంచ్‌గా పోటీలో నిలిపారు.

పది రోజుల క్రితం లచ్చంగౌడ్ తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. దాంతో స్నేహితుడి భార్య రాధను గెలిపించే బాధ్యతను దొమ్మాటి నర్సయ్య తీసుకున్నాడు. శనివారం జరిగిన ఎన్నికల్లో రాధ 130 ఓట్ల తేడాతో పరాజయం పొందింది. దీనితో మనస్తాపం చెంది నర్సయ్య ఉరి వేసుకున్నాడు.

English summary

 A lady software engineer committed suicide in lodge situated at Lakdi ka pool in Hyderabad committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X